సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నివాళులర్పించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం, భారతదేశ తొలి ఉప ప్రధాని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా పిఠాపురం జనసేన నాయకులు మరియు శ్రీవిష్ణు హాస్పటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడిగానే కాకుండా, స్వాతంత్ర్యానంతరం నిజాంతోపాటు అన్ని సంస్థానాలను భారతదేశంలో విలీనం కావడానికి గట్టి కృషిచేసిన గొప్ప మనిషి, భారతదేశ తొలి ఉప ప్రధాని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆ మహనీయుని ఆశయాలను తమ అధినేత పవన్ కళ్యాణ్ పుణికిపుచ్చుకుని, రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ అరాచకపాలనపై అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారని జనసేనపార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.