అనుసూరి వీరభద్రరావు కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ బి. కొత్తూరు గ్రామం నందు అనుసూరి వీరభద్ర రావు అకాల మరణానికి చింతిస్తూ వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అనంతరం వారి యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం ఒక నెలకు సరిపడా 50 కేజీలు బియ్యం మరియు నిత్యవసర సరుకులు అందించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా అనుసూరి అబ్బాయి, అనుసూరి వెంకటరమణ, అనుసూరి సత్తిబాబు, దుడ్డు రాంబాబు దమ్మేటి రాజేష్, వీరమరెడ్డి అమర్, కూరడా సత్తిబాబు, అనుసూరి కృష్ణ, రావడ అర్జన్న, కాళ్ళ మహేష్, మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.