ఓసుపల్లి రాజకుమార్ ను పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ కొత్తపల్లి మండలం, ఉప్పాడ గ్రామం నందు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకున్నటువంటి ఓసుపల్లి రాజకుమార్ ని తన స్వగృహం నందు పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పరామర్శించి, తగిన సలహాలు సూచనలు అందించడం జరిగింది. అనంతరం వారి కుటుంబ అవసరాల నిమిత్తం ఒక నెలకు సరిపడా 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వంకా కొండబాబు, ఎక్స్ సర్పంచ్ గరగ సత్యానందం, కొత్తపల్లి రాజు, మడదా ప్రసాద్, మడదా ఏసుబాబు, సూరడా ఏసుబాబు, రాచపల్లి గోపి, కారే మోసే, కోదా కుమార్, నాకేలే సతీష్, కారే దావీదు, ఓసిపల్లి ప్రసాద్ ఓసిపల్లి చిన్న, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.