రైలు ప్రమాదంలో కాలు కోల్పోయిన నక్క శ్రీనును పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం: చిత్రాడ గ్రామం, బీసీ కాలనీకి చెందిన నక్క శ్రీను ఇటీవల ట్రైన్ యాక్సిడెంట్ లో తన కాలు పోగొట్టుకోవడం జరిగింది. ఈ కారణంగా వారి కుటుంబం పలు ఆర్ధిక ఇబ్బందులు పడుతుంది. ఈ విషయాన్ని స్థానిక జన సైనికులు పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ గారికి తెలపడం జరిగింది. విషయం తెలుసుకున్న డాక్టర్ పిల్లా శ్రీధర్ స్పందించి మానవతా దృక్పథంతో నక్క శ్రీను ను పరామర్శించి వారి కుటుంబానికి మనోధార్యాన్నిస్తూ కుటుంబ అవసరాల నిమిత్తం ఒక నెలకు సరిపడా 50 కేజీల బియ్యం మరియు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబల దాసు, మత్స్యకార నాయకులు పల్లేటి బాపనదొర, పల్నాటి మధు, వేల్పుల చక్రధర్, వీరమరెడ్డి అమర్, దుడ్డు రాంబాబు, పి కుమార్, బుద్దాల సత్తిబాబు కోటిపల్లి గోపి, భావిశెట్టి నంది బాబు, కోటిపల్లి కాశి, బసవ గోపి, నాగం మధు, పెంట వెంకటేష్, నాయుడు మణికంఠ, సింగటపు నారాయణరావు, మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.