జనసేన జనజాగృతి యాత్ర 40వ రోజు

  • జనజాగృతి యాత్రలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జనసేన రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంట స్వరూప

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, పశ్చిమ గానుగూడెంలో జనసేన జనజాగృతి యాత్ర 40వ రోజులో భాగంగా రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ ఆదేశాల ప్రకారం జనసేన పార్టీ ఆడపడుచు జనసేన రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంట స్వరూప ముఖ్య అతిధిగా పాల్గొని జనజాగృతి యాత్రలో భాగంగా రాజానగరం నియోజకవర్గం, పశ్చిమ గానుగూడెంలో ఇంటింటికి జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఇప్పటిదాకా ఏ అధికారం లేకపోయినా ప్రజలపక్షాన నిలబడుతూ ఏమేం కార్యక్రమాలు చేసాం అన్నది వివరిస్తూ పార్టీ కి అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా స్వరూప మాట్లాడుతూ మేము వెళ్లి నమస్కారం చేస్తుంటే వాళ్లంతట వాళ్ళే జనసేన వాళ్ళు వచ్చారని ఆప్యాయంగా ఆహ్వానించి అమ్మా ఈసారి మా ఓట్లు పవన్ కళ్యాణ్ కేనమ్మా అంటూ వాళ్లంతా ఎంతో ఆపేక్షగా మాట్లాడటం చాలా మంచి పాజిటివ్ ఫీలింగ్ కలిగింది.. 2024 లో ఒక గొప్ప మార్పుని చూడబోతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 40,000 గ్లాజు గ్లాసులు నియోజకవర్గం పలు గ్రామాలలో అందించడం జరిగింది. వచ్చే ఎన్నికల వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతుంది గాజు గ్లాస్ పంపిణీ కార్యక్రమం కూడా కొనసాగుతుందని ఇంచార్జ్ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు మండపాక శ్రీను, రాజానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కొచ్చెర్ల బాబీ, సాయి, సురేష్, పోసిబాబు, ముక్కా రాంబాబు, తన్నీరు తాతాజీ, తెలగం శెట్టి శివ, మురళి స్థానిక జనసేన నాయకులు పాల్గొన్నారు.