కంబాల దాసు సతీమణిని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్
పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ ఇటీవల కాలుకు ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చినటువంటి రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు సతీమణిని పరామర్శించి ఆమె యొక్క ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా తగు జాగ్రత్తలు ఆరోగ్య సూచనలను సలహాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గరగ సత్యానందం, మత్స్యకార నాయకులు పల్లేటి బాపన దొర, గంపల తాతారావు, పిరది అప్పారావు, పుక్కల్లా కుమార్, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-05-at-21.48.39-1024x461.jpeg)