‘స్పుత్నిక్‌- V’ సరఫరా చేసేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ సిద్దం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను నియంత్రిoచేందుకు అన్ని దేశాలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే  రష్యాకు చెందిన గమలేయ నేషనల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ అండ్‌ మైక్రోబయాలజీ స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదే స్పుత్నిక్‌- V వ్యాక్సిన్‌ దేశంలో అడుగు పెట్టనుంది. ఈ వ్యాక్సిన్‌ మూడవ దశ ఔషధ పరీక్షలతోపాటు పంపిణీ కోసం హైదరాబాద్‌ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్, రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో కరోనా వ్యాక్సిన్‌ విషయంలో భారత్‌లో ముందడుగు పడింది.

అలాగే భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించిన తర్వాత రెడ్డీస్‌కు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఆర్‌డీఐఎఫ్‌ సరఫరా చేయనుంది. పరీక్షలు విజయవంతం అయి, వ్యాక్సిన్‌ నమోదు ప్రక్రియ పూర్తి అయితే.. ఈ ఏడాది చివరి నుంచే దేశంలో వ్యాక్సిన్ల డెలివరీ ఉండే అవకాశం ఉందని రెడ్డీస్‌ ప్రకటించింది.