జనసైనికులతో సమావేశం నిర్వహించిన డా.వడ్లపట్ల సాయిశరత్

దెందులూరు నియోజకవర్గం, దెందులూరు మండలం పోతునూరు మరియు మేదినరావుపాలెం గ్రామాలలో జనసైనికులతో సమావేశం నిర్వహించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి డా.వడ్లపట్ల సాయిశరత్. ఈ సమావేశంలో క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి అన్ని వర్గాలవారికి రాజ్యాధికారాన్ని దగ్గర చేసే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని పేర్కొంటూ, పార్టీ నుంచి కావలసిన మద్దతు అన్ని రకాలుగా అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.