వారాహి మాతకి ఘనంగా పూజలు నిర్వహించిన వీరమహిళలు

  • జనసేన ఎన్నికల యుద్ధ రథం వారాహి రిజిస్ట్రేషన్ విజయవంతం

విజయవాడ: తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పార్టీ ఆఫీసులో జనసేన ఎన్నికల యుద్ధ రథం వారాహి విజయవంతంగా రిజిస్ట్రేషన్ పూర్తయిన సందర్భంగా.. పవన్ కళ్యాణ్ బస్సు యాత్రని విజయవంతంగా పూర్తిచేయాలని, 2024 లో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని, వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడాలని, వారాహి మాతకి ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించిన జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గం వీరమహిళలు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పోతిరెడ్డి అనిత, దోమకొండ మేరీ, అమృత కళాదేవి, పాశం సుజాత, మాకినీడి నీరజ, నాగమణి, శిరీష, స్వాతి, కుమారి, సూర్యవతి, అపర్ణ, నాగ రాజేశ్వరి, విజయ కుమారి, దోమకొండ అశోక్, పోతిరెడ్డి రమణ, పెళ్లూరి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.