10వ తరగతి బాలుడు ఉప్పాల అమర్నాథ్ హత్యను ఖండించిన దూదేకుల ఖాసీం సైదా

గురజాల: చెరుకుపల్లి మండలం, ఉప్పాలవారి పాలెం గ్రామంలో బీసీ కులానికి చెందిన గౌడ అడ బిడ్డతో అసభ్యంగా ప్రవర్తించిన వెంకటేశ్వరరెడ్డి అనే వైసీపీ కార్యకర్తని అడ్డుకున్నందుకు ఆమె సోదరుడు అయిన అమర్నాద్ ని మమ్మల్నే అడ్డుకుంటారా అని 10వ తరగతి చదువుతున్న ఉప్పాల అమరనాధ్ గౌడ్ అనే విద్యార్ధి ని కాపు కాసి నీకు దిక్కు ఎవరు అని అతనిని నలుగురు కలసి భయంకరముగా హింసించి కర్రలతో, రాడ్లతో కొట్టి పెట్రోల్ పొసి తగల పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య అని, ఈ ఘటనను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని జనసేన పార్టీ నాయకులు దూదేకుల ఖాసీం సైదా అన్నారు. ఇలాంటి చర్యలు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఏ స్థితిలో ఉన్నాయో అర్థం అవుతుందని, ఎన్నికలకు ముందు బీసీలే వెన్నెముకని ప్రగల్బాలు పలికి అధికారం చేపట్టిన తర్వాత బీసీల నడ్డి విరగగొడుతున్నారని, అధికార అండతో బీసీలపై రాష్ట్రంలో దాడులు ఎక్కువ అవుతున్నాయి అని అన్నారు. రాబోయే రోజుల్లో బీసీలు అందరూ కలసిఈ వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని, ఈ ఘటనకు పాల్పడిన నిందితులకు, కఠిన శిక్షణ విధించి భాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.