పొన్నలూరు మండల జనసేన నాయకుల ముందస్తు అరెస్టు
కొండెపి నియోజకవర్గం: ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ పార్టీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ సంఘిభావ మద్దతు ప్రకటించింది. ఈ నేపధ్యంలో సోమవారం పొన్నలూరు టీడీపీ శ్రేణులతో కలిసి శాంతియుతంగా 50 మంది జనసేన పార్టీ నాయకులతో బంద్ చేపట్టాలని ఆలోచనలో ఉన్న జనసేన మండల అధ్యక్షుడు కనపర్తి మనోజ్ కుమార్, జనసేన మండల ఉపాధ్యక్షుడు కర్ణ తిరుమలరెడ్డి, మండల కార్యదర్శి సుంకేశ్వరం శ్రీను, మండల కార్యదర్శి కాకాని ఆంజనేయులు, మండల కార్యదర్శి నూకల లక్ష్మీనారాయణ, మండల కార్యదర్శి మెండ భానుచందర్ జనసేన పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసిన పొన్నలూరుఎస్ ఐ దాసరి రాజారావు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-11-at-5.28.06-PM-1024x461.jpeg)