తెలంగాణలో ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఎంసెట్ పరీక్షల షెడ్యూల్‌ని రాష్ట్ర సాంకేతిక విద్యామండలి అధికారులు ఇవాళ విడుదల చేశారు. దీని ప్రకారం జూలై 5వ తేదీన అగ్రికల్చర్ పరీక్ష నిర్వహించనుండగా..జూలై 6వ తేదీన మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష జరగనుంది. జూలై 7 నుంచి 9 వ తేదీ వరకూ అంటే మూడ్రోజుల పాటు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు  జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన అప్లికేషన్ల కోసం ఈనెల 18వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. ఫిబ్రవరి 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎంసెట్‌లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ నుంచి వంద శాతం, సెకండియర్‌ నుంచి 70 శాతం సిలబస్‌ ఉంటుందని ఉన్నతాధికారులు తెలిపారు. ప్రతి రోజు రెండు దశల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష జరగనుంది.