ఏలూరులో జనసేనలో చేరికలు

ఏలూరు నియోజకవర్గంలోని 6వ డివిజన్ మాదేపల్లి రోడ్ మొండిల కాలనీ, పోలేరమ్మ గుడి ప్రాంగణం దగ్గర జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఇతర పార్టీల నుండి రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో 60 మంది యువకులు జాయిన్ అవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఏలూరు సిటీ వైడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, నగర ఉపాధ్యక్షుడు బొత్స మధు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, 6వ డివిజన్ ప్రెసిడెంట్ బుధ్ధా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.