ధరణి యాప్ లో సీఎం నివాసం వివరాల నమోదు

ధరణి యాప్‌లో సీఎం కేసీఆర్‌ నివాసం వివరాలు నమోదు చేశారు. ఎర్రవెల్లిలో సీఎం నివాసానికి వెళ్లి గ్రామ కార్యదర్శి వివరాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రజలంతా తమ స్థిరాస్తుల వివరాలను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఆస్తులపై ప్రజలకు సంపూర్ణ హక్కు, ఆస్తుల పట్ల భద్రత కల్పించే ఉద్దేశంతోనే ధరణి యాప్ తీసుకువచ్చామని వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా తామే స్థిరాస్తి నమోదు ప్రక్రియ చేపట్టామని, ఇది చారిత్రాత్మక విధానం అని అన్నారు. ప్రజలంతా తమ ఆస్తుల వివరాలను ఇందులో నమోదు చేసుకోవాలని సూచించారు.

ధరణి పోర్టల్ ను దసరా (అక్టోబరు 25)  రోజున సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ధరణి పోర్టల్ ప్రారంభానికి ముందే రాష్ట్రవ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా భూముల విలువ ఖరారు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.