జాతీయ రైతు దినోత్సవ వేడుకలలో ఎచ్చెర్ల జనసేన

  • జాతీయ రైతు దినోత్సవం వేడుకలలో పాల్గొన్న రైతులు

ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, రణస్థలం పంచాయతీ నగరపాలేం గ్రామంలో ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన నాయకులు కరిమజ్జి మల్లీశ్వారావు అధ్వర్యంలో డిసెంబర్ 23, శుక్రవారం జాతీయ రైతు దినోత్సవం వేడుకల సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందులో భాగంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల్లో భరోసా నింపేందుకు 3వేల కుటుంబాలకు ఒక్కొక్కరికి పవన్ కళ్యాణ్ గారు లక్షరుపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందజేస్తున్న విషయం గురించి గ్రామాల్లో రైతులుతో సమావేశం ఏర్పాటు చేసి, వారియొక్క సమస్యలను తెలుసుకోని గ్రామాల్లో వ్వవసాయ భూములను సందర్శించడం జరిగింది. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి లాభసాటిగా చేసే విధానాల గురించి అందరికీ తెలియజేసి రైతుల సంక్షేమం కోసం జనసేన పనిచేస్తుందని రైతులకు భరోసా కల్పించడం జరుగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కృష్ణాపురం పంచాయతీ యంపీటీసీ అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు, జే.ఆర్.పురం జనసేన పార్టీ నాయకులు దాసరి.బలరాం, స్ధానిక జనసేన సర్పంచ్ అభ్యర్థి కరిమజ్జి వెంకటరమణ, కరిమజ్జి జగన్నాథం, కరిమజ్జి సత్యం, మనిపురి పోలినాయుడు, కెల్లా రామకృష్ణా, కరిమజ్జి బాస్కరావు, రౌతు భద్రయ్య, కెల్లా గోవింద, కెల్లా రామునాయుడు, కెల్లా పార్వతమ్మ, రౌతు లక్మీ, వాళ్ళే రామలక్మి, మీసాల లక్ష్ముమ్మ, గంట్యాడ దమయంతి, రైతుల కుటుంబాలు పాల్గొన్నారు.