ప్రతి జనసైనికుడికి అండగా ఉంటా: బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, శ్రీ పాటిపాటెమ్మ పోలేరమ్మ తల్లి అమ్మవారి కొలుపులకు గ్రామ కార్యక్రమానికి గ్రామ జనసైనికులు మరియు మండల అధ్యక్షులు తోట నరసయ్య ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా బొర్రా వెంకట అప్పారావుని ఆహ్వానించడం జరిగింది. బొర్రా గ్రామానికి వెళ్ళి ముందుగా అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రత్యేక పూజలో పాల్గొనడం జరిగినది. అనంతరం గ్రామస్తుల ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాను సందర్శించడం జరిగినది. ఈ సందర్భంగా బొర్రా మాట్లాడుతూ ఈ ఊరితో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని అలాగే ప్రజారాజ్యం రాజకీయాలను గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సారధ్యంలో పనిచేయటం నాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు అలాగే గ్రామంలో ఎక్కడైనా సరే జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టిన ప్రతి జనసైనికుడికి కూడా తాను అండగా ఉంటానని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పార్టీ కోసం పనిచేసే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ని మనం ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నామో అలాంటి ఉన్నతమైన స్థాయిలో చూసేలా ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలని పార్టీని మరింత బలంగా గ్రామాల్లోకి తీసుకెళ్లాలని అలాగే తాను చేపట్టిన ఇంటింటికి జనసేన అనే కార్యక్రమాన్ని గ్రామాల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని కోరారు నాకు అవకాశం ఇస్తే మంత్రి అంబటి రాంబాబు చిత్తుచిత్తుగా ఓడించే బాధ్యత నేను తీసుకుంటానని ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని కలిగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నాలుగు మండలాధ్యక్షులు, కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్ కుమార్, మండల కమిటీ సభ్యులు, గ్రాంమ కమిటీ సభ్యులు నామల పుష్ప, మండల కార్యదర్శి పసుపులేటి వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు గరుడ వెంకట శివ, పసుపులేటి శ్రీనివాసరావు, కొనతం లింగయ్య, పసుపులేటి సాంబశివరావు, మారిశెట్టి సాంబశివరావు, పులిబండ నాగమల్లి, పసుపులేటి గోపి, గ్రామ జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.