పవన్ కళ్యాణ్ ప్రతి మాట.. మన భవిష్యత్తుకు బాట: కరిమజ్జి మల్లేశ్వర రావు

*పవనన్న ప్రజాబాట 80వరోజు

శ్రీకాకుళం: ఇంటింటికీ జనసేన కార్యక్రమంలో భాగంగా.. శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం, తిరుపతి పాలెం గ్రామంలో 80 వ రోజు సొసైటీ బ్యాంక్ మాజీ చైర్మన్, ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకుడు, జిల్లా జనసేన నేత, రాజకీయ అనుభవజ్ఞుడు.. కరి మజ్జి మల్లేశ్వర రావు పర్యటించారు… ఈ సందర్భంగా మల్లేశ్వర రావు మాట్లాడుతూ.. జనసేన పార్టీ జన సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ అని, పార్టీ లక్ష్యం నిరంతర అభివృద్ధి భావితరాల భవిష్యత్ కోసం కృషి చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా కొనియాడారు. పవన్ కళ్యాణ్ ప్రతి మాట.. మన భవిష్యత్తుకు బాట అనడంలో ఎటువంటి సందేహం లేదని తెలియజేశారు. అనేక ప్రభుత్వాలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేయడంలో విఫలం అయ్యాయని గుర్తు చేస్తూ.. పవన్ అన్న ప్రభుత్వం, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో “గాజు గ్లాస్” గుర్తు పై మీ ఓటు వేసి, మీరంతా క్రియాశీలకంగా వ్యవహరించి.. పవన్ కళ్యాణ్ సారధ్యంలో, మన ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం పవన్, సమర్థ నాయకత్వాన్ని సాధిద్దాం.. ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యంపిటీసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.