పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలి: జనసేన జానీ

  • జనసేన – గిరిసేన కార్యక్రమం 40వ రోజు

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం జనసేన – గిరిసేన కార్యక్రమంలో భాగంగా 40వ రోజు వీరఘట్టం మండలం గెడగాం గ్రామంలో జనసేన జానీ పర్యటన చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన జానీ మాట్లాడుతూ.. గెడగాం గ్రామంలో జనసేన పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని, అదేవిధంగా డిసెంబర్ 23వ తేదీన రైతు దినోత్సవం సందర్బంగా రైతులతో సమావేమై వారి యొక్క సమస్యలు తెలుసుకొని, రైతులు కోసం జనసేన పార్టీ ఏ విధంగా అండగా ఉంటుంది అనేది వివరించాలి అని, ఉదాహరణకీ ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతులు చనిపోతే ప్రభుత్వం గానీ, ప్రతి పక్షం గానీ పట్టించుకోకపోయినా జనసేన పార్టీ అది నాయుకులు శ్రీ కొణిదల. పవన్ కళ్యాణ్ గారి కష్టార్జితాన్ని పంచిపెట్టే విధానం తెలియజేయాలని. అలానే యువతకి ఎలాంటి పోస్టింగ్స్ తియ్యకుండా యువకులను నిరుద్యోగులుగా మార్చిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది అని, అందుకు ప్రజలు కష్టాలను, యువత సమస్యలు తీరాలి అంటే జనసేన ప్రభుత్వం స్థాపించాలి అని అందుకు ప్రతి ఒక్కరూ దేశ సైనికులులా పని చెయ్యాలి అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గెడగాం గ్రామ పెద్దలు మధు, మహేష్, యువత హరీష్, అశోక్, శ్రీను, అనంత్, జనసైనికులు పాల్గొన్నారు.