రైతు భరోసా యాత్రను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి: పంతం నానాజి

కాకినాడ రూరల్, ప్రజా వ్యతిరేక పనులు, గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలు పట్ల అవగాహన కొరకు, వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, ధరల పెరుగుదల, రహదారుల నిర్మాణం మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజాశ్రేయస్సు కోసం చేసే కార్యక్రమాలు, వైసీపీప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన రైతాంగ కుటుంబానికి దైర్యం కల్పించాలని నిర్ణయించి తన కష్టార్జితాన్ని రైతుకుటుంబాలకి 1 లక్ష రూపాయలు ఇస్తున్న విషయాన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, గ్రామ సమస్యలపై అవగాహన కల్పించుకుని ప్రజలకి అండగా ఉండాలని, యువతకి, ఓటు లేని వారికి ఓటు నమోదు చేయించాలని.. త్వరలో గ్రామాల పర్యటన ఉంటుంది అని సోమవారం జరిగిన జి.భావవరం గ్రామ కమిటీ అధ్యక్షులు వై.రామకృష్ణ అధ్యక్షతన గ్రామ కమిటీ సభ్యుల సమావేశంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కరప మండల ప్రెసిడెంట్ బండారు మురళి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాటికాయల వీరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి శిరంగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.