రైతులకు మేలు జరగాలంటే పవన్ కళ్యాణ్ సిఎం కావాలి: గంగారపు రామదాస్ చౌదరి

మదనపల్లె, టమోటా రైతులకు మేలు జరగాలంటే పవన్ కళ్యాణ్ సిఎం కావాలని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి అన్నారు. “జనంతో‌ టీ జనసేన” కార్యక్రమంలో భాగంగా మదనపల్లె టమోటా మార్కెట్ వద్ద రైతులతో కలిసి టీ సేవిస్తూ రైతు సమస్యలు తెలుసుకున్నారు. టమోటా రైతులు పెట్టుబడి సైతం గిట్టుబాటు కాక తీవ్ర నష్టలలో కూరుకు పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ‌ప్రస్తుతం 30 కేజీల బాక్స్ ధర కేవలం 150 మాత్రమే ఉందని వాపోయారు.‌ ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం ,చేనేత విభాగ అడపా సురేంద్ర, ఐటి విభాగ నాయకులు జగదీష్, మదనపల్లె రూరల్ మండల అద్యక్షులు గ్రానైట్ బాబు, లక్ష్మీపతి, రెడ్డెమ్మ, స్వాతి, అర్జున్, నాగరాజ తదితరులు పాల్గొన్నారు.