జనసైనికులే జనసేన బలం: మేడిశెట్టి సూర్యకిరణ్

ప్రతిపాడు నియోజకవర్గం, శంఖవరం మండలం, కత్తిపూడి గ్రామం యాదవ కమ్యూనిటీ హల్ లో జనసేన జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కరణం సుబ్రాహ్మణ్యం ఆధ్వర్యంలో.. జనసేన పార్టీ శంఖవరం మండలం అధ్యకులు గాబు సుభాష్ అధ్యక్షతన జరిగిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిత్ల పంపిణీ కార్యక్రమంకు నియోజకవర్గ జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్(బాబి) హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మేడిశెట్టి సూర్యకిరణ్(బాబి) ప్రత్తిపాడు నియోజకవర్గంలో అత్యధికంగా 229 క్రియాశీలక సభ్యత్వాలు చేసిన కరణం సుబ్రహ్మణ్యం ను అభినందించి, జనసైనికులకు కిట్లను అందించారు..

సభ్యత్వం తీసుకున్న ప్రతీ ఒక్క జనసైనికునికి జనసేన పార్టీ అండగా ఉంటుందని, నియోజకవర్గంలో జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు, శ్రీ పవన్ కళ్యాన్ గారు చేస్తున్న కౌలు రైతు భరోసా యాత్ర గురించి ప్రతీ ఒక్కరికి తెలిసేలా చేయాలని జనసైనికులకు దిశా నిర్దేశం చేశారు..

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఇందన సత్తి వీర్రాజు, కత్తిపూడి గ్రామాధ్యక్షులు పోసిన వెంకటేశ్వరరావు, సీతంపేట గ్రామ అధ్యక్షుడు కొయ్యా మోహన్, మండపం గ్రామ అధ్యక్షులు వేల్పుల ప్రసాద్, మండల కార్యదర్శి కొయ్యా శ్రీను, మండల కార్యదర్శి గుండుబిల్లి సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షుడు కౌలూరి రమేష్, చిన బాబి, బొజ్జా చిన్న, జీలకర్ర శ్రీను, జయరాజ్, అప్పారావు, రాము, సాయి, ప్రవీణ్ మరియు అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు..