గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి: శ్రీమతి మాకీనీడి శేషుకుమారి

పిఠాపురం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి మాకీనీడి శేషుకుమారి పిఠాపురం మండలం గోకివాడ గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటపొలాలను సందర్శించి స్థానిక కౌలు రైతులతో చర్చించి పంట నష్ట వివరాలు అడిగి తెలసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆకల వర్షాల వల్ల చేతికొచ్చిన పంటను నష్టపోయిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తేం నానాజీ, నామా బుల్లి కాసులు, కొత్తేం రాంబాబు, విశ్వనాథం నానాజీ, కాయల పవన్, కొడమంచిలి దుర్గా ప్రసాద్, కిరణ్, లచ్చ, అయ్యప్ప, సాయి, గోకివాడ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.