రైతులకు నష్టపరిహారం చెల్లించాలి: ఎన్ని రాజు

రాజాం: ఉమ్మడి శ్రీకాకుళం, రాజాం మండలంలో తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల పంట పొలాలను అధికారులు సందర్శించి తగిన నష్టపరిహారాన్ని ఆయా రైతులకు చెల్లించాలని జనసేన పార్టీ సమన్వయకర్త ఎన్ని రాజు ఆధ్వర్యంలో బుచ్చింపేట రైతులు ఉప తాసిల్దారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ఉపతాసిల్దార్ తగిన చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.