పిఠాపురం జనసేన ఆధ్వర్యంలో తుఫాను బాధితులకు అన్నదానం

పిఠాపురం, జనసేన పిఠాపురం ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు పిఠాపురం ప్రజలకు అలుపు లేకుండా సర్వీస్ చేస్తున్న జనసేన పార్టీ పి.ఎస్.ఎన్. మూర్తి పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొండెవరం దళిత కాలనీలో తీవ్ర తుఫాను తాకిడికి నిలువ నీడలేక, ఆహారం అందక పేద ప్రజలు ఇబ్బందులు పడటం బాధాకరం తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వాపోయారు. ఎప్పుడు విపత్తు వచ్చినా సాయం చేయడంలో ముందుండే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్, పి.ఎస్.ఎన్ మూర్తి ఈ సారి కూడా తన వంతు సాయానికి 700 మందికి అన్నదానం చేయడానికి ముందుకు వచ్చారు. సాధ్యమైనంత త్వరగా చేతనైన సాయంతో ఊరట కల్పించారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు బాధల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నానని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీనువాస్. కసిరెడ్డి నాగేశ్వరావు, కోలా దుర్గాదేవి, పబ్బిరెడ్డి భీమేశ్వరావు మల్లం బీసీ నాయకులు వై శ్రీనువాస్, తోట సతీష్, పెంకే జగదీష్, నామ శ్రీకాంత్, గొల్లప్రోలు సారధి మరియు పి. ఎస్.ఎన్. మూర్తి పాల్గొన్నారు.