పలువురి కుటుంబాలను పరమర్శించిన పితాని బాలకృష్ణ

కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం: ఐ పోలవరం, తాళ్లరేవు మండలాల్లో పలువురి కుటుంబాలను జనసేన పార్టీ రాష్ట్ర పి.ఏ.సి సభ్యలు నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ పరామర్శించారు.

ఐ పోలవరంలో ఇటీవల మరణించిన దంగుడుబియ్యం సత్యవతి, కుటుంబ సభ్యులను, కుమారులు నాగేశ్వరరావు, రామారావు, నారాయణరావు లను, పెదమడి గ్రామంలో ఇటీవల మరణించిన గుబ్బల సాంబమూర్తి, వారి కుటుంబ సభ్యులను, జి వేమవరం గ్రామంలో హార్ట్ అటాక్ తో మరణించిన కోళ్ల బాబాలు, కుటుంబసభ్యులను, వారి సోదరుడు వీరభద్రరావు (భద్రం)గార్లను పరామర్శించి ఓదార్చారు, అలాగే తాళ్లరేవు మండలం రాజన్న పాలెం గ్రామంలో ఇటీవల మరణించిన జనసేన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి వారికి జనసేనపార్టీ అండగా ఉటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సానబోయిన మల్లికార్జున రావు, గోదశి పుండరీష్, జక్కంశెట్టి పండు, మద్దిశెట్టి పురుషోత్తం, గోలకోటి వెంకన్నబాబు, సాన బోయిన వీరభద్రరావు, దూడల స్వామి, లంకలపల్లి జమ్మి, మాదాల శ్రీధర్, నాతి నాగేశ్వరరావు, గంగ బత్తుల రాంబాబు, సలది రాజా, రాయపు రెడ్డి ఆనంద్, ఇండుగుల రామకృష్ణ, ఉండ్రు సత్తిబాబుతదితరులు ఉన్నారు.