మొగలి సత్తిబాబు ను పరామర్శించి వారి కుమారులకు కొత్త బట్టలు, నగదు అందజేసిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: సోమవారం జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం నగర పంచాయతీ క్రాప చింతలపూడి గ్రామానికి చెందిన ప్రమాదవశాత్తు వెన్నుముక విరిగి బాధపడుతున్న మొగలి సత్తిబాబు ను పరామర్శించి వారి కుమారులకు కొత్త బట్టలు, నగదుఅందజేశారు. ఈ కార్యక్రమంలో సానబోయిన మల్లికార్జునరావు కడలి కొండ, షేక్ మస్తాన్, మాదాల శ్రీధర్, దామిశెట్టి రాజా, మాదాల నిఖిల్, చింతలపూడి సతీష్, పాయసం చిన్నాజీ, పాయసం సాయి, మాదాల చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.