అగ్నిప్రమాద బాధితులకి అండగా పితాని

డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, ఐ.పోలవరం మండలం,తిళ్ళకుప్ప గ్రామానికి చెందిన ఎస్సీ గ్రామంలో మూడు ఇల్లు షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధం అయి, సర్వం కోల్పోయారు. విషయం తెలుసుకున్న వెంటనే జనసేన రాష్ట్ర పిఎసి సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆ ఇళ్లను సందర్శించి 20 వేల రూపాయల నగదు, బియ్యం మరియు నిత్యావసర వస్తువులు, బట్టలు ఇచ్చి వారి కుటుంబాలకు జనసేన-టీడీపీ ప్రభుత్వం వచ్చాక వారికి ఇల్లు నిర్మించి ఇస్తామని వారికి హామీ ఇచ్చి ధైర్యం చెప్పి, జనసేన పార్టీ మీకు ఎల్లపుడు అండగా ఉంటుందని వారికి దైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కపునడు నియోజకవర్గ ఇంచార్జ్ పెమ్మిరెడ్డి వీరవెంకట సత్యనారాయణ, కేశనకుర్రు గ్రామ ప్రెసిడెంట్ గుత్తుల శ్రీను, ఉండ్రు సత్య నారాయణ, సత్తియ్యనాయుడు, జగదీష్ నాయుడు, పెన్నాడ శివ, సలాది రాజా, భీమాల సూర్య, సంసాని పాండురంగారావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.