జనసేనలో చేరికలు

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలంలోని, పాటురు వారి ఖండ్రిగ గ్రామం నుంచి బెల్లంకొండ రమేష్ సమక్షంలో గ్రామ యువత జనసేన పార్టీ ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మనుబోలు గణపతి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన-టీడీపీ ఉమ్మడి గెలుపుకు యువత కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామ యువతను జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల నాయకులు పోలూరు పెంచల నరసింహా, వీరబాబు, చినకంగారి కసుమూరు, పి. మల్లి, తాండ్ర శ్రీనివాసులు పాల్గొన్నారు.