‘మోత మోగిద్దాం’ టీడీపీ నిరసనకు పితాని సంఘీభావం

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇచ్చిన పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు మరియు మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ వారు తలపెట్టిన మోత మోగిద్దాం శనివారం సాయంత్రం 7.00 గంటలనుండి 7.05 నిమిషాలవరుకు వరకు గంటకొట్టి నిరసనతెలిపే కార్యక్రమాన్ని జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐ పోలవరం మండలం కొమరగిరి వీరాజుచెరువు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొప్పిశెట్టి గణేష్, సానబోయిన వీరభద్రరావు, బొంతు వెంకటరమణ, మరియు కొమరగిరి వీరాజు చెరువు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.