ఫాతిమాని పరామర్శించిన జనసేన రాష్ట్ర కర్యదర్శి కమాల్

సత్తెనపల్లిలో గురువారం ఫాతిమా అనే మహిళపైన అతి దారుణంగా గొంతు కోసిన సంఘటన విదితమే.. ఈ సంఘటనలో గాయపడిన ఫాతిమా.. గుంటూరు జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫాతిమాను శుక్రవారం జనసేనపార్టీ రాష్ట్ర కర్యదర్శి షేక్ నాయబ్ కమాల్ పరామర్శించారు. ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. ఈ సందర్భంగా కమాల్ మాట్లడుతూ.. రాష్ట్రంలో మహిళలకి రక్షణ కరువైందని, మహిళలు స్వేచ్చగా సంచరించే పరిస్థితులు రాష్ట్రంలో మరుగయ్యాయని అన్నారు. ఫాతిమాని హత్యాయత్నం చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి, త్వరితగతిన విచారణ పూర్తిచేసి కఠిన శిక్ష విధించాలన్నారు. అదేవిధంగా ఫాతిమా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, ఫాతిమాకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫాతిమాని సకాలంలో అసుపత్రిలో చేర్చి ఆమె ప్రాణాలు కాపాడడంలో కీలక భూమికను పోషించిన సత్తెనపల్లి జనసైనికులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కమాల్ తో పాటు జనసేనపార్టీ ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు కూడా పాల్గొన్నారు.