కిడ్నీ వ్యాధిగ్రస్తునికి రూపాయలు 20వేలు ఆర్ధికసాయం
అమలాపురం పట్టణం 9వ వార్డుకు చెందిన సుంకర నాగేశ్వరావు (51)రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఆయనకు భార్య ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన కౌన్సిలర్ 9వ వార్డ్ గొలకోటి విజయలక్ష్మి, ఆమె భర్త వాసు, మరియు 7వ వార్డ్ జనసేన కౌన్సిలర్ గండి దేవి హారిక, స్వామి ఒక ఫౌండేషన్ ద్వారా నాగేశ్వరరావు, భార్య నాగమణికి రూపాయలు 20 వేలు వైద్య ఖర్చుల కోసం ఆర్థికసాయం అందించారు. ఈ సందర్బంగా వారిని, ఫౌండేషన్ సభ్యులను సుంకర కుటుంబీకులు అభినందించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-08-at-14.45.28-1024x461.jpeg)