ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న జనసైనికునికి ఆర్దిక సహాయం

శానపల్లిలంక చెందిన జంగా సంతోష్ అనే వ్యక్తి కొంతకాలంగా ప్లేట్లెట్స్ పడిపోయి ఆర్దికంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పెంటపాటి రవి నాయుడు, ఉపాధ్యక్షుడు షారుక్ ఖాన్ మండల పార్టీ అధ్యక్షులు మద్ద చంటిబాబు స్పందించి ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచ్ మరియు జనసైనికుల నుంచి కొంత డబ్బు సేకరించి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్లి మోహన్, పడాల గిరి, కుప్పాల రాంబాబు, అడపా నాగ భూషణం, గుర్రాల రాంబాబు, దాడిశెట్టి రాజా, శ్రీరామ్, వానపల్లి ప్రసాద్, సలాది బుచ్చిరాజు, బండారు కరుణ్, మేడిద దుర్గాప్రసాద్, పాల్గొన్నారు.