చోడవరంలో జనసేనలో చేరికలు

•కండువా కప్పుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు

చోడవరం నియోజకవర్గం, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామంలో విద్య, వైద్యం, ఉపాధి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ పీవీఎస్ఎన్ రాజు స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల మౌలిక వసతుల కల్పన మీద దృష్టి సారిస్తామని తెలిపారు. శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే ప్రజా సమస్యలు తీరుతాయన్నారు. రావికమతం మండలం, పి.పొన్నవోలు పంచాయితీలో వైసీపీ, టీడీపీలకు చెందిన 30 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. శ్రీ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలకు ఆకర్షితులై వీరంతా జనసేన కండువా కప్పుకున్నారు. శ్రీ పీవీఎస్ఎన్ రాజు వీరికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వం ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో రావికమతం మండల పార్టీ అధ్యక్షులు శ్రీ మైచర్ల నాయుడు, పార్టీ నాయకులు శ్రీ పిల్లా అప్పల నాయుడు, శ్రీ సిరిశాల రాముడు, శ్రీ పులకండం సురేష్, శ్రీ పులకండం శ్రీనివాసరావు, శ్రీ పులకండం శ్రీను, శ్రీ అల్లంపల్లి సతీష్, శ్రీ ఎలిశెట్టి రాముడు, శ్రీ విసారపు గోవింద, శ్రీ చింతల కిషోర్, శ్రీ లోట్ల శివ, శ్రీ సోమిరెడ్డి శివ శంకర్ మరియు పొన్నవోలుకు చెందిన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.