మలిశెట్టి వెంకటరమణ సహకారంతో వరద బాధితునికి ఆర్థిక సహాయం

అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో చెయ్యేరు వరద బాధితునికి రాజంపేట అసెంబ్లీ జనసేన పార్టీ ఇంచార్జీ మలిశెట్టి వెంకటరమణ ఆర్థిక సహకారంతో జనసేన ప్రతినిధులు బుధవారం చెయ్యేరు వరద బాధిత కుటుంబానికి పోషణ కోసం 20 వేల రూపాయలు, ఇంటి నిర్మాణం 75 వేలు అందజేశారు. ఈ సందర్భంగా 2021 సెప్టెంబర్ నెలలో చెయ్యేరుకు వరద పోటెత్తడంతో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. పరివాహక ప్రాంతాలు, అపార ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. ఇందులో శివారెడ్డి అనే బాధితుడు ఇండ్లు, పశువులు, భూమి సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలాడు. కొడుకు, కూతురుతో కలిసి చిన్న తాత్కాలిక ప్లాస్టిక్ పట్టల ఇంటిలో జీవనం గడిపేవాడు. అధికార పార్టీ నేతలను, అధికారులను అందరిని కలిసినా ఎవరూ సహాయం చేయక పోవడంతో రాజంపేట జనసేన ఇంచార్జీ మలిశెట్టి వెంకటరమణ నేనున్నాను అనే భరోసా ఇచ్చి మానవత్వం చాటుకుని సహాయం అందించారు. ఇందులో భాగంగా కుటుంబ పోషణ కోసం గతంలో 25 ఇవ్వగా, ఇంటి నిర్మాణం కోసం 75 వేలు బుధవారం మలిశెట్టి వెంకట రమణ రాయల్ ప్రతినిధులు అందజేశారు. గతంలో 20 వేలు మరోసారి 75 వేలు ఆర్థిక సహాయం ఇవ్వడంపై బాధిత కుటుంబం హర్షం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు, జనసేన నాయ కులు భాస్కర పంతులు, చెక్ డ్యామ్ వెంకటయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.