ప్రమాదబాధితునికి జనసైనికులు ఆర్థిక సాయం

తూర్పుగోదావరి, కోనసీమ జిల్లా మొగలికుదురు గ్రామానికి చెందిన చందన కేదారేశ్వరావుకు ప్రమాదంలో రెండు కాళ్ళు విరిగి పోవడంతో బ్రతుకు దెరువు కోల్పోయాడు. మొగలికుదురు – జగ్గన్నపేట జనసైనికులు రూపాయలు 16వేలు నగదు, 3వేల రూపాయల విలువైన నిత్యావసర వస్తువులు, ఒక బియ్యం బస్తా అందచేసారు.