ఎన్ని రాజు ఆధ్వర్యంలో ఆర్థిక భరోసా
రాజాం నియోజకవర్గం: సంతకవిటి మండలం, కే. ర్. పురానికి చెందిన బొడ్డేపల్లి రాము వృత్తిరీత్యా మత్స్యకారుడు గత కొన్ని రోజులుగా కుడికాలు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న జనసైనికులు రాజాం నియోజకవర్గం నాయకులు ఎన్ని రాజుకు తెలియపరచడంతో వెంటనే స్పందించి వారిని పరామర్శించి ఆర్థికంగా 5000/-విరాళం అందజేశారు. రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ తరఫున ఆదుకుంటాము అని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కేఆర్ పురం సైనికులు, ప్రవీణ్, వావిలాపల్లి కిరణ్, కెల్లా సూర్యనారాయణ, గవరయ్య, హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-16-at-6.25.57-PM-1024x462.jpeg)