రాజధాని మోటార్ స్పేర్స్ లో భారీ అగ్నిప్రమాదం

బేగంబజార్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సిద్దింబర్‌ బజార్‌ రాజధాని మోటర్స్‌ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్‌సర్క్యూట్‌తో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో నాలుగు ఫైరింజన్లు హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.

ప్రతి రోజు మాదిరిగానే యజమాని బబ్లు జైన్ గోదాంను తెరిచి లావాదేవీలు కొనసాగిస్తున్నాడు. గోదాంలో స్పెర్ పార్ట్స్ సామాగ్రి తీసుకొని మధ్యాహ్నం 12 గంటలకు సిబ్బంది కిందకు వచ్చారు. ఆ సమయంలో గోదాంలోని ఓ గదిలో నుండి పొగలు రావడంతో అప్రమత్తమైన యజమాని వెంటనే గౌలిగూడా ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చాడు. దాదాపు మూడు గంటల పాటు 8 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో వివిధ కార్లకు సంబంధించిన లక్షలు విలువ చేసే స్పెర్ పార్ట్స్ అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం సంభవించినప్పుడు గోదాంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

టాస్​ గెలిచిన ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్​ ఎంచుకుంది

అబుదాబి వేదికగా ముంబయి ఇండియన్స్​, రాజస్థాన్​ రాయల్స్ మధ్య మ్యాచ్​ జరుగు తుంది. గత రెండు మ్యాచ్​లో విజయం సాధించిన ముంబయి.. ఈ మ్యాచ్​తో హ్యాట్రిక్​ కొట్టడానికి ప్రణాళికలను రచిస్తుంది. మరోవైపు వరుసగా రెండు ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్.. ముంబయిని ఓడించి టోర్నీలో మళ్లీ గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. టాస్​ గెలిచిన ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్​ ఎంచుకుంది. ఎలాగైనా ఈ మ్యాచ్​ గెలిచి హ్యాట్రిక్​ కొట్టాలని కెప్టెన్​ రోహిత్​ శర్మ భావిస్తున్నాడు.