జనసేనలో పార్టీలో చేరిన మత్స్యకారులు

  • ఐ పోలవరం, కాట్రేనికోన మండలాలనుండి జనసేనపార్టీలో చేరిన మత్స్యకారులు

ముమ్మిడివరం నియోజకవర్గం: రాష్ట్ర జనసేన పార్టీ పి ఏ సి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ సమక్షంలో ఐ. పోలవరం మండలం భైరవపాలెం తీర్ధాలమొండి నుండి పోతాబత్తుల గోవిందరాజు, ఓలేటి బాబి, పోతాబత్తుల వెంకటరత్నం, సంగాడి నరసింహరాజుల ఆధ్వర్యంలో ఓలేటి మణి, రేఖాడి రాజు, కర్రి గణేష్, మల్లాడి శ్రీను, మల్లాడి వెంకట్రావు, వాడ్రెవు వర్మ, పెమ్మాడి నాగూర్, పిసింగి నాగూర్, అర్దాది వెంకట కామేష్, సంగాడి ధనబాబు మొదలగువారు సుమారు 200 మంది మరియు కాట్రేనికోన మండలం, పల్లం గ్రామం నుండి మల్లాడి సతీష్ ఆధ్వర్యంలో పట్టా కాసురాజు, అంగాడి శంకర్రాజు, మల్లాడి మహేష్, మల్లాడి ధర్మ, కర్రి వెంకటేష్, మల్లాడి శ్రీను మొదలగు 50 మంది వివిధ పార్టీల నుండి జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పితాని బాలకృష్ణ గారి యొక్క సేవా దృక్పధం నచ్చి జనసేన పార్టీలోకి జాయిన్ అయినట్లు వారంతా తెలియజేశారు.ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ.. మత్స్యకార సోదరులకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని యువత రాజకీయాల్లోకి రావాలన్నది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయమని అన్నారు ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని, రాబోయే రోజుల్లో మీ యువత అంతా పార్టీకి కష్టబడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), ఐ పోలవరం మండల అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, ముమ్మిడివరం నగర పంచాయతీ అధ్యక్షులు కడలి వెంకటేశ్వరరావు (కొండ), ముమ్మిడివరం మండల అధ్యక్షులు దూడల స్వామి, ముమ్మిడివరం మండల నగర పంచాయతీ ఉపాధ్యక్షులు యలమంచిలి బాలరాజు, గుద్దటి విజయ్, పితాని రాజు, చిక్కం రామచంద్రుడు, విత్తనాల రవి, మొదలగువారు పాల్గొన్నారు.