జనసేన నాయకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

కనిగిరి మండలం, బల్లిపల్లి పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీలోని నివాసం ఉంటున్న ప్రజలకు, పిల్లలకు బుధవారం జనసేన నాయకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కనిగిరి మండల అధ్యక్షుడు ఇండ్ల రమేష్, జనసేన పార్టీ నాయకులు మాదాల కొండలరావు, మాదాల మల్లికార్జున, షేక్ హుస్సేన్, కుంచె చరణ్, కోటం శెట్టి సిసింద్రీ, కోటం శెట్టి బాబు, కాకర్ల మాలకొండయ్య, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.