జనసేన గ్రామ కమిటీల నియామక పత్రాలు అందజేసిన అక్కల గాంధీ

  • జనసేన గ్రామ కమిటీల నియామక పత్రాలు అందజేసిన అక్కల రామ మోహన్ రావు (గాంధీ)

మైలవరం నియోజకవర్గం: జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, మైలవరం మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి నియామక పత్రాలను ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మి, మండలం అధ్యక్షులు శీలం బ్రహ్మం ఎర్రబోలు లక్ష్మీనరసింహారావు, పోలిశేట్టి తేజ కృష్ణ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల అధ్యక్షులకు ఇవ్వటం జరిగినది. జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా అన్ని గ్రామాల్లోనూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అక్కల గాంధీ. జనసైనికులకు నాయకులకు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో అన్ని మండలం కమిటీ సభ్యులు గ్రామాల అధ్యక్షులు జనసైనికులు వీరమహిళలు నాయకులు పాల్గొనడం జరిగింది.