జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు ఇవ్వటం చాలా సంతోషదాయకం

కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం: బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించటం చాలా సంతోషకరమైన విషయం. 2019లో ఇదే గాజు గ్లాస్ గుర్తుపై ఎన్నికలలో పోటీ చేయడం జరిగింది. మరల 2024లో జరిగే ఎన్నికలలో జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించినందుకు కేంద్ర, రాష్ట్ర, ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. గురువారం అవినిగడ్డ టౌన్ అధ్యక్షులు రాజనాల వీరబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు ఇచ్చిన సందర్భంగా సంతోషం వ్యక్తపరచడం జరిగింది. రాబోయే 2024 ఎన్నికల్లో ప్రజలు గ్లాసు గుర్తుపై ఓటు వేసి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపరిచి, జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు, జనసేన పార్టీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బచ్చు శ్రీహరి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మత్తి సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ అవనిగడ్డ టౌన్ ఉపాధ్యక్షులు ఆళ్ళమళ్ళ చందు బాబు, టౌన్ కార్యదర్శి అన్నపురెడ్డి ఏసుబాబు పాల్గొని కార్యక్రమమును విజయవంతం చేసినారు.