ముఖ్యమంత్రి సహాయ నిధికి మాజీ గవర్నర్ విరాళం
మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్లో నెలకొన్న పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల కోసం ప్రభుత్వం చేపడుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలను అభినందించారు. వీటి కోసం తన వంతు సాయంగా వ్యక్తిగత సేవింగ్స్ నుంచి రూ.25 వేలను సీఎమ్ఆర్ఎఫ్కు అందించారు. పరిస్థితి త్వరగా కుదుటపడాలని ఆకాంక్షించారు. విరాళాన్ని ప్రకటించిన నరసింహన్కు… సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.