నేడు వరద ప్రాంతాల్లో పర్యటించనున్నకేంద్రమంత్రి కిషన్ రెడ్డి

నగరంలో వరద ముంపునకు గురైన పలు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈరోజు పర్యటించనున్నారు. ఉదయం 9గంలకు తార్నాకలోని మాణికేశ్వర్ నగర్‌లో కిషన్‌రెడ్డి పర్యటించనున్నారు. అనంతరం మెట్టుగూడ, అంకమ్మ బస్తీ, శ్యామలకుంట, మహ్మదీయ హాస్పిటల్, కోమటికుంట, ఓల్డ్ ప్రేమ్ నగర్, నరేంద్ర నగర్‌లోని వరద ప్రాంతాలను కేంద్రమంత్రి పరిశీలించనున్నారు. సాయంత్రం 5 గంటలకు జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువును కిషన్‌రెడ్డి పరిశీలించనున్నారు.