మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బ్రతికే ఉన్నారు: అభిజిత్
అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరని, మరణించారని బుధవారం రాత్రి సోషల్ మీడియాలో పలువురు అసత్య ప్రచారాలు చేశారు. వాస్తవానికి అదృష్టవశాత్తుగా ఆయన బతికే ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజీత్ ముఖర్జీ ( Pranab Mukherjee’s son Abhijit Mukherjee ) ట్విటర్ ద్వారా స్పందిస్తూ బుధవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. తన తండ్రి ఆరోగ్యం ప్రస్తుతానికి హీమోడైనమికల్లీ స్టేబుల్గా ( Haemodynamically stable – గుండె నుంచి ఇతర రక్తనాళాల్లోకి బ్లడ్ పంపింగ్ ప్రక్రియ సాధారణంగా ఉండటం ) ఉందని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న వాళ్లంతా వారి ప్రార్థనలు కొనసాగించాలని అభిజీత్ ముఖర్జీ తన ట్వీట్ ద్వారా విజ్ఞప్తిచేశారు.
My Father Shri Pranab Mukherjee is still alive & haemodynamically stable !
— Abhijit Mukherjee (@ABHIJIT_LS) August 13, 2020
Speculations & fake news being circulated by reputed Journalists on social media clearly reflects that Media in India has become a factory of Fake News .