జనసేన క్రియాశీలక సభ్యులకు ఉచిత కంటి వైద్య శిబిరం

కాకినాడ రూరల్: జనసేన పార్టీ అధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే క్రియాశీలక సభ్యుల కార్తీక వన సమారాధనలో డాక్టర్ చిట్ల కిరణ్ సహకారంతో అమరావతి ప్రైమరీ ఐ కేర్ వారి సహాయంతో కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో కళ్ళ జోళ్ళు అవసరమైన వారికి తదేకం ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో కళ్ళ జోళ్ళు ఏర్పాటు చేసారు. వాటిని పంపిణీ చేసే కార్యక్రమం కాకినాడ గొడరిగుంటలో గల జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంఛార్జి పంతం నానాజీ స్వగృహం వద్ద ఆయన చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సంధర్బంగా నానాజీ మాట్లాడుతూ పార్టీ క్రియా శీలక సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి పార్టీ వారికి అండగా ఉంటుందని బరోసా కల్పించే విధంగా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాదవరపు తాతాజీ, నూకల నారాయణ రావు, తాటికాయల వీరబాబు, తదేకం ఫౌండేషన్ ప్రతినిధి శాండీ ఆకుల మణికుమార్, తురగా సంతోష్, జీని శ్రీను తదితరులు పాల్గొన్నారు.