తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగాధగా మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీదుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నిన్న రాత్రి జరిగిన గరుడసేవను వీక్షించడానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయర్‌స్వామి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, పేష్కార్ జగన్మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడనని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.