చింతా మేఘనను అభినందించిన గాదె వెంకటేశ్వరరావు

తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం కొర్రపాడు గ్రామంలో సత్తెనపల్లి ప్రగతి డిగ్రీ కళాశాల విద్యార్థి దక్షిణ భారత దేశ హ్యాండ్ బాల్ ఉమెన్ పోటీలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తరుపున సెలెక్ట్ అయిన చింతా మేఘనను ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు కొర్రపాడు గ్రామం లో గల వారి ఇంటికి వచ్చి సన్మానించి వారికి అభినందనలు తెలియచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మణిక్యాలరావు, ఎస్. శ్రీను, సత్తెనపల్లి నాయకులు వి. శ్రీనివాస్, రాడ్లు శ్రీనివాస్, మెడికొండూరు మండల అధ్యక్షులు రాచర్ల నాగబాబు, ఉపాధ్యక్షులు కుమార్, మండల కార్యదర్శి ఎం. హరి, బాలకృష్ణ, మండల నాయకులు మరియు గ్రామం నాయకులు ఎం. శ్రీనివాస్, పి. శ్రీనివాస్, సిహెచ్ భద్రయ్య, ఎం. బాలకోటేశ్వరరావు, అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.