వారోత్సవాలలో మొదటిరోజు మొక్కలు నాటిన గజపతినగరం జనసేన

గజపతినగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా గజపతినగరం మండలం పాతబగ్గం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల వద్ద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు మర్రపు సురేష్.

శనివారం నుంచి సెప్టెంబర్ రెండో తేదీ వరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో రోజుకి ఒక్కొక్క కార్యక్రమం చొప్పున

  1. మొక్కలు నాటే కార్యక్రమం
  2. సర్వమత ప్రార్థనలు(ప్రత్యేక పూజలు)
  3. గజపతినగరం నియోజకవర్గంలో మెగా వైద్య శిబిరం
  4. మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ
  5. ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పండ్లు మరియు రోట్టెలు పంపిణీ కార్యక్రమం
  6. మెగా రక్తదాన శిబిరం మరియు సెప్టెంబర్ 2వ తేదీన జనసేన పార్టీ కార్యాలయం వద్ద సంస్కృతిక కార్యక్రమాలు మరియు కేక్ కటింగ్ నిర్వహిస్తున్నట్టు జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు మర్రపు సురేష్ తెలిపారు. ఈ యొక్క కార్యక్రమాలకు, పార్టీ సీనియర్ నాయకులు, మోహన్ రావు, రవి కుమార్ మిడతాన, బాలు, మురళి మోహన్, జనసేన నియోజకవర్గం పార్టీ నాయకులు శ్రీను, పండు, మహేష్, హరీష్, రవీంద్ర, నాయుడు అధిక సంఖ్యలో పాల్గొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికలలో ప్రతి ఒక్క జనసైనికులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి స్థానంలో చూడాలి అంటే ఇవాల్టి నుంచి ప్రతి ఒక్క జనసైనికుడు అహర్నిశలు పార్టీ కోసం సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.