గాజువాక నియోజకవర్గంలో జగ్గు జంక్షన్ వద్ద విజయవంతంగా శ్రమదాన కార్యక్రమం చేపట్టిన గాజువాక జనసైనికులు

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రంలో అధ్వానంగా మారిన రోడ్లను శ్రమదానం తో జనసైనికులు అందరూ వాళ్ల వాళ్ల నియోజకవర్గాల్లో మరమ్మతులు చేయాలని పిలుపునిచ్చారు. గాజువాక నియోజకవర్గంలో PAC సభ్యులు, గాజువాక ఇంచార్జ్ కోన తాతారావు గారు ఆధ్వర్యంలో కనితి రోడ్డు జగ్గు జంక్షన్ శ్రీ కృష్ణ దేవరాయ విగ్రహం వద్ద ఎంతో అధ్వానంగా మారిన రోడ్లను నియోజకవర్గ జనసైనికులు అందరూ శ్రమదానం తో గుంతలను పూడ్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, 64 వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి, రాష్ట్ర మత్స్యకార విభాగం వైస్ చైర్మన్ రేయి రత్న, జిల్లా లీగల్ సెల్ కళావతి, కోన చిన్న అప్పారావు, కరణం కనకారావు, ఆర్మీ గోవింద్, గవర సోమశేఖర్, ముమ్మిన మురళి, సంద్రాన్ని భాస్కర్, త్రినాధ్, లంక మురళి దేవి, జ్యోతి రెడ్డి, గుంటూరు మూర్తి, ముసలయ్య, వినోద్, శ్రీకాంత్, వంశీ, విజయ్, రామారావు, నియోజకవర్గ సీనియర్ నాయకులు, వీర మహిళలు జనసైనికులు మరియు పాల్గొన్నారు.