గాంధీజి కలలు కన్న ఆశయాలు ఆశలు జనసేనతోనే సాకారం

  • మహాత్ముడు చూపిన సత్యం అహింస మార్గంలో నడుద్దాం ప్రజలకు సేవ చేద్దాం
  • జనసేన పార్టీ రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత

అనంతపురం: మహాత్మా గాంధీ 154వ జయంతిని పురస్కరించుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత అనంతపురం నగరంలోని స్థానిక గడియారం కూడలిలో గల గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సత్యం అహింసలను ఆయుధాలుగా చేసుకొని వందల సంవత్సరకాలం భారతదేశాన్ని అడ్డగోలుగా దోచుకుని దేశ ప్రజలను చీడ పురుగులాగ పట్టిపీడించిన బ్రిటీష్ వారినుంచి దేశాన్ని రక్షించి దేశ స్వాతంత్య్రం కోసం అనేక ఉద్యమాలు చేసి ఎటువంటి పదవులను, ఆధికారానికి ఆశ పడకుండా తన జీవితం మొత్తం దేశానికే అర్పించిన గొప్పవ్యక్తి మహాత్మా గాంధీ అని అలాగే అప్పట్లో బ్రిటిష్ వారు దేశాన్ని దేశ ప్రజలను ఎలాగైతే పట్టిపీడించి ప్రజల హక్కులను కాలరాసారో ప్రస్తుతం ఈ వైసీపీ ప్రభుత్వం బ్రిటిష్ వారికి మించి ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజల పై, ప్రతిపక్షాలపై రాక్షసత్వం ప్రదర్శిస్తూ వ్యవహరిస్తూ ప్రజల హక్కులను హరిస్తున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా ఎటువంటి పదవులను, అధికారాన్ని ఆశించకుండా రాష్ట్రా భవిష్యత్తు కోసం, వైసీపీనీ రాష్ట్రం నుంచి తరిమి వేయడానికి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి వీరమహిళలు శైలజ, గాయత్రి జనసేన నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.